ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. మారిన రీఛార్జ్ ప్లాన్లు!

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. కొన్ని ప్లాన్ల ధరలు, ప్రయోజనాలను సవరించింది. ప్రస్తుతం రూ.349 నుంచి అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.399, రూ.449 ప్లాన్లలో అధిక డేటాతో పాటు అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.899, రూ.979 ప్లాన్లు, వార్షికంగా రూ.3,999 ప్లాన్ కూడా అందుబాటులో ఉన్నాయి. రీఛార్జ్‌కు ముందు Airtel Thanks యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో తాజా ధరలు, ప్రయోజనాలను చెక్ చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది.