తిరుపతిలో భారీ చోరీ.. రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు అపహరణ

తిరుపతిలోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు షోరూమ్ వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. షోరూమ్‌లోని సుమారు రూ.1.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 50 ఐఫోన్లు, 150 ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.