మరణశిక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మరణశిక్ష అమలుకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉరి విధానాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. ఉరికి ప్రత్యామ్నాయంగా లెథల్ ఇంజెక్షన్, కాల్చడం వంటి ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దేశంలో మరణశిక్ష అమలుకు ఉరి విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది.