రూ.64 కోట్ల బ్రిడ్జి.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది!
ఉత్తరప్రదేశ్: మిర్జాపూర్లో రూ.64 కోట్లతో నిర్మించిన ఆమ్ఘాట్ రైల్వే ఓవర్బ్రిడ్జి ప్రారంభించిన ఆరు నెలల్లోనే కుంగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ వంతెనకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకవైపు భాగం కుంగిపోయినట్లు సమాచారం బ్రిడ్జి నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని బీజేపీ ప్రభుత్వం అవినీతితో వృథా చేస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి..