హుజూర్నగర్లో రైస్ ఇండస్ట్రీపై విజిలెన్స్ దాడులు.. రూ.12.5 కోట్ల ధాన్యం లెక్కల్లో తేడా
హుజూర్నగర్లోని శ్రీ శృతి రైస్ ఇండస్ట్రీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో రూ.7.5 కోట్ల విలువైన ధాన్యం షార్ట్ఏజ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.5 కోట్ల విలువైన ధాన్యం టెండర్ పే కింద ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. మొత్తంగా రూ.12.5 కోట్ల విలువైన ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.