నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ గార్డెన్లో GEN -Z యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నల్లగొండ జిల్లా సభ్యుడు మరియు జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మల్లన్నకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో ప్రజలు, ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా సమస్యలను మండలిలో ప్రస్తావించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మొహమ్మద్ అలీ విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ మల్లన్న, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


