హంటర్ రోడ్డులో మద్యం మత్తులో కారు ఢీ.. హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూత
వరంగల్, ఆగస్టు 26: హంటర్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు.
దేశాయిపేటకు చెందిన శ్రీనివాస్ 2012 బ్యాచ్ కానిస్టేబుల్గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటెలిజెన్స్ విభాగంలో రైటర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి హంటర్ రోడ్డులో మిత్రుడి కోసం వేచి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఆయనను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతితో దేశాయిపేటలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


