హైదరాబాద్, సెప్టెంబర్ 13, విజయ కెరటం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అధికారులు, ఉద్యోగస్తులకు టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.


