వరంగల్, ఆగస్టు 12: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)ను మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్తాచెదారం లేకుండా పరిసరాలు, అప్రోచ్ రోడ్లను నిత్యం శుభ్రంగా ఉంచాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సమీకృత కలెక్టరేట్ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్


