ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.
సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా పలువురు వినియోగదారులు కేవైసీ పూర్తి చేయలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు సమీప గ్యాస్ ఏజెన్సీలో లేదా సంబంధిత అధికారిక యాప్ల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.


