ఎయిర్ ఇండియా విమానం 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందికి పడిపోయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానాన్ని నడిపిన పైలట్కు నిర్వహించిన డ్రగ్ టెస్టులో సైకోయాక్టివ్ పదార్థాలు (గంజాయి) ఉన్నట్లు తేలినట్లు సమాచారం.
ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లకు స్క్రీనింగ్ నిర్వహించగా.. కో-పైలట్కు ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు గుర్తించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై కేంద్రం సీరియస్గా స్పందించి ఎయిర్ ఇండియా CEOకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.


