న్యూఢిల్లీ: దీర్ఘకాలం మన్నే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను 2027 ఏప్రిల్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
తొలి దశలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో విలువకు 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లు చలామణిలోకి తీసుకురానున్నారు.
పేపర్ నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని ఆర్బీఐ తెలిపింది. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇకపై పేపర్, పాలిమర్ నోట్లు రెండూ చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది.


