జగిత్యాల, ఆగస్టు 13: లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంచికట్ల రాహుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
బీర్పూర్కు చెందిన ఓ వ్యక్తి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్తో పాటు పట్టాదార్ పాస్బుక్ జారీ చేసేందుకు అధికారిక అనుకూలత చూపాలని రాహుల్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో లంచాన్ని రూ.40 వేలకు తగ్గించగా, అందులో భాగంగా రూ.30 వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అధికారులు రూ.30 వేల లంచం సొమ్మును రాహుల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. �
Telangana ACB :
**లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించవచ్చు.**


