ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కనీస అర్హతగా కొనసాగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. 2013కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత పొందేందుకు సుప్రీంకోర్టు తుది గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
అభ్యర్థులకు తగిన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం ఏడాదికి కనీసం రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతో టెట్ అర్హత పొందని ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరింత సమయం లభించనుంది.


