: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన నాలుగు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


