కాకినాడ: ఫీజు చెల్లింపు విషయంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ (17) మృతి చెందడం కలకలం రేపింది.
విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆరోపిస్తూ ఆగ్రహించిన కొందరు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అలాగే ప్రిన్సిపల్పై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి మృతికి గల పూర్తి కారణాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.


