హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్లు ఒక్కరోజులోనే గణనీయంగా ఎగిశాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,49,730కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,37,250 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా అధిక స్థాయిలో కొనసాగుతూ కిలోకు రూ.2,40,000గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే ధరలు అమల్లో ఉన్నాయి. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో నగలు కొనుగోలు చేయాలనుకునే వారు, పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.


