నల్గొండ నగరంలోనే పేరు మోసిన పిల్లల ఆసుపత్రి అది..అయినా
ఆ పిల్లల హాస్పిటల్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న పాపను అనురాగ్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు ఎన్ఆర్ఐ దంపతులు. మూడు రోజులు గడిచినా పాప ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ సుధాకర్ స్పష్టత ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపోస్తున్నారు.
పాప పరిస్థితి ఏంటని డాక్టర్ సుధాకర్ను నిలదీసిన తల్లిదండ్రులు. ప్రశ్నించిన తమను “మూర్ఖులు” అంటూ డాక్టర్ సుధాకర్ సంబోధించారంటూ తల్లిదండ్రుల ఆరోపణ. చిన్నారి వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.


