25.2 C
Hyderabad
Thursday, September 17, 2026
Homeతెలంగాణసాయంత్రంలోగా రాజీనామా డెడ్‌లైన్ మంత్రి పదవికి గుడ్‌బై చెప్పనున్న సురేఖ
Advertisement spot_img

సాయంత్రంలోగా రాజీనామా డెడ్‌లైన్ మంత్రి పదవికి గుడ్‌బై చెప్పనున్న సురేఖ

Must read

కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సాయంత్రం లోపు రాజీనామా సమర్పించకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోపే సురేఖ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బర్తరఫ్ అవడం కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే మంచిదని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

పునరాలోచించాలని కోరినప్పటికీ, సురేఖకు ఎలాంటి ఊరట దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరమని భావిస్తూ, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.